ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ లోని పురూలియాలో గత నెలలో జూడాన్ మహతో అనే 45 ఏళ్ల వ్యక్తిని భార్య ఉత్తర, ఆమె లవర్ క్షేత్రపాల్ మహతోతో కలిసి హత్య చేసింది. జైపూర్ నివాసి అయిన క్షేత్రపాల్ కు ఉత్తర లు కలిసి జూడాన్ ను అంతమొందించడానికి ప్లాన్ వేశారు. క్షేత్రపాల్ సూచించిన విధంగానే భార్య ఉత్తర జూడాన్ ను పదునైన ఆయుధం ఉపయోగించి చంపేసింది. అయితే నేరం బయటపడకుండా ఉండేందుకు జూడాన్ మృతదేహం త్వరగా కుళ్లిపోయేలా ఉప్పును ఉపయోగించాలని పథకం వేశారు. పాతిపెట్టే ముందు ఉప్పును ఉపయోగించింది. అయితే జూడాన్ కుమారుడు అతని మృతదేహాన్ని మార్చి 26న కనుగొన్నాడు. ఈ కేసుపై పోలీసులు హత్యనేరాన్ని నమోదు చేశారు. విచారణ కొనసాగుతుండగా ఉత్తరే తన భర్తను హత్య చేసిందని పోలీసులు అనుమానించారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా క్షేత్రపాల్ తో ఉన్న వివాహేతర సంబంధం గురించి చెప్పింది. ఈ హత్య చేసిన తర్వాత పరిస్థితి సద్దుమణిగే వరకు క్షేత్రపాల్ జార్ఖండ్ లో తలదాచుకోవాలని అనుకున్నాడు. అయితే ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. పురూలియా జిల్లా కోర్టులో హజరుపరిచారు. అతడికి  కోర్టు ఐదురోజుల పోలీస్ కస్టడీని విధించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)