ఆలయంలో వేప వృక్షం కూలి ఏడుగురు మృతి

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని  అకోలా జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులకు బాబూజీ మహారాజ్‌ ఆలయంలో వేప వృక్షం కూలి షెడ్‌పై పడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 30 మంది దాక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రాలతో విరిగిన చెట్టును, కూలిని షెడ్డు భాగాలను తొలగించి, అందులో చిక్కుపోయిన వారిని రక్షించినట్లు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)