కొడుకును ప్రేమించి తండ్రిని పెళ్లాడిన యువతి !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌ చకేరి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 నెలల క్రితం యువతి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెను వెదికారు. ఢిల్లీలో ఉన్న యువతిని పట్టుకున్నారు. విచారించడంతో అసలు విషయం చెప్పింది. తాను ప్రేమించిన వ్యక్తి తండ్రితో పారిపోయి పెళ్లి చేసుకొని ఢిల్లీలో కాపురం పెట్టినట్లుగాతెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లా కంజుసి గ్రామంలో నివాసముంటున్న కమలేష్ కుమార్ వృత్తిరీత్యా తాపీ మేస్త్రీ. 2022లో చకేరి పోలీస్ స్టేషన్‌లో నిర్మాణలను తన కొడుకుతో కలిసి చేశాడు. అదే సమయంలో తన కొడుకు ఆ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలిసిన కమలేష్ కుమార్ తన కుమారుడిని మందలించి ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ప్రేమించిన అమ్మాయితో కలవకుండా చేశాడు. అయితే తండ్రి నిర్భందించినప్పటికి కమలేష్‌కుమార్ కొడుకు అమిత్ ప్రేమించిన యువతితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత వీరిద్దరి పెళ్లికి కమలేష్ అంగీకరించినట్లుగా సమాచారం. ఇదే సమయంలో 2022 మార్చిలో ఆ యువతి కనిపించకుండా పోయింది. యువతి కుటుంబ సభ్యులు, బంధువులు చాకేరి పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కిడ్నాప్ కేసు పెట్టారు. మరోవైపు ప్రేమించిన యువతి అదృశ్యం కాగా, మరోవైపు తండ్రి కూడా కనిపించకుండపోవడంతో అమిత్‌, అతని కుటుంబ సభ్యులు కూడా కమలేష్‌కుమార్ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులు, అమిత్ కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. విడివిడిగా ఫిర్యాదులు నమోదు చేసిన పోలీసులు గత ఏడాది కాలంగా కమలేష్, యువతి ఆచూకీ కనిపెట్టడంలో సఫలమయ్యారు. వీరిద్దరూ ఢిల్లీలో సహజీవనం చేస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి ఆచూకి కనుగొన్నారు. ఆమె ఉంటున్న అడ్రస్‌కి వెళ్లి చూడగా కిడ్నాపైన యువతితో పాటు ఆమె ప్రియుడి తండ్రి ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు యువతిని రక్షించి వైద్య పరీక్షలు చేయించారు. కమలేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ గుర్తించిన పోలీసులు వారిని విచారించగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తాను కూడా కమలేష్‌ను ప్రేమిస్తున్నానని, అతనితో వెళ్లానని యువతి పోలీసులకు చెప్పిందని ఏసీపీ అమర్‌నాథ్ యాదవ్ తెలిపారు. అమిత్ కోసం ఇంటికి తరచూ వచ్చిన సమయంలోనే యువతి అతనితో పాటు కమలేష్‌తో మాట్లాడేది. ఆ పరిచయమే ఇద్దరి మధ్య ప్రేమకు కారణమైందని తెలిపింది. ఆ ప్రేమ ఇద్దరూ ఎవరికి చెప్పకుండా ఢిల్లీకి పారిపోయి కలిసి జీవించేలా చేసిందని ఒప్పుకున్నారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను కోర్టులో హాజరుపరచనున్నారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)