ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో బీఎస్పీకి చెందిన రాజ్ పాల్ను 2005లో హత్య చేశారు. ఈ కేసులో ప్రధాని సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ను ఆరుగురు వ్యక్తులు గత వారం నడిరోడ్డుపై కాల్పులు జరిపి హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కూడా తీవ్ర దుమారం రేగింది. దీంతో, సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరుస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉమేశ్ భార్య జయ పాల్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లోని కౌంధియారా పోలీసు స్టేషన్లో నిందితుడు విజయ్ అలియాస్ ఉస్మాన్ను ఎన్కౌంటర్లో కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఉమేశ్ పాల్పై కాల్పులు జరిపిన వారిలో ఉస్మాన్ మొదటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో మరో నిందితుడు అర్బాజ్ను ఫిబ్రవరి 27న పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతడు పారిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎన్కౌంటర్ జరిగింది.
ఉత్తరప్రదేశ్లో మరో ఎన్కౌంటర్ !
March 06, 2023
0
Tags