నరేంద్ర మోడీపై పరువు నష్టం దావా వేస్తా !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలయం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కే కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీనిపై కోర్టులు ఎంత వేగంగా స్పందిస్తాయో చూస్తానని రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. 2018లో పార్లమెంట్‌లో 'శూర్పణఖ' అంటూ తనపై చేసిన ఆరోపణపై ప్రధాని నరేంద్ర మోడీపై పరువు నష్టం కేసు వేస్తానని రేణుకా చౌదరి చెప్పారు..

Post a Comment

0Comments

Post a Comment (0)