ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన గంగాద్రి అనే వ్యక్తి తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని లగేజీ కౌంటర్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి సప్తగిరి చెకింప్ పాయింట్ వద్ద బ్యాగుతో తత్తరపాటుతో కనిపించాడు. దీంతో స్పెసల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చెక్ చేయగా అతని వద్ద 15 ప్యాకెట్లలో నింపిన 150 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని స్టేషన్కు తరలించి ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయగా నిందితుడు గంజాయిని ప్లాస్టిక్ కవర్లో చిన్న ప్యాకెట్లుగా ఉంచి, వాటిని కాలికి కట్టుకుని తిరుమలకు వచ్చినట్లుగా తేలింది.
తిరుమలలో గంజాయి పట్టివేత
March 25, 2023
0
Tags