నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి !

Telugu Lo Computer
0


మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన పూనమ్ కౌర్, సినిమాల కన్నా వివాదాలోతోనే ఎక్కువ ఫేమస్ అయినా ఈ భామ గతేడాది చివర్లో అరుదైన ఫైబ్రో మాయల్జియా అనే వ్యాధి తో పోరాడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. దీనికోసం కేరళలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక పూనమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రాజకీయాల గురించి కానీ, ప్రజా సమస్యల గురించి తనదైన శైలిలో విమర్శిస్తూనో, ప్రశంసిస్తూనో చేసి నెటిజన్ల విమర్శలను అందుకుంటూ ఉంటుంది.  తాజాగా పూనమ్ కౌర్ ఒక స్టేజిపైనే కంటనీరు పెట్టుకుంది. తనను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. రాజ్ భవన్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు పూనమ్ హాజరై మాట్లాడుతూ తీవ్ర భావోద్వాగానికి గురు అయ్యింది. తన మతం ద్వారా తనను వేరు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ” నేను తెలంగాణలో పుట్టాను, ఇక్కడే పెరిగాను. కానీ నేను పంజాబీని అని, సిక్కుని అని  మతం పేరు మీద నన్ను దూరం చేస్తున్నారు. నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి. నా మతం పేరు చెప్పి నన్ను వెలి వేయకండి. నేను తెలంగాణ బిడ్డనే..” అంటూ ఆమె స్టేజిపైనే కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)