మహారాష్ట్ర లోని నాగ్పూర్ లో 41 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ఓ హోటల్కు వెళ్లాడు. అక్కడ ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఆ రాత్రి మద్యం సేవించాడు. ఇక మద్యం సేవిస్తూనే 50 ఎంజీ చొప్పున ఉన్న రెండు వయాగ్రా పిల్స్ను వేసుకున్నాడు. ఆ రాత్రంతా వ్యక్తి బాగానే ఉన్నప్పటికీ తెల్లారేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తెల్లవారుజామున వాంతులు చేసుకున్నాడు. దీంతో ఆస్పత్రికి వెళ్దామని ప్రియురాలు చెప్పినప్పటికీ అతను వినిపించుకోలేదు. గతంలోనూ ఇలాగే అయిందని చెప్పి ఊరుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చేసేదేమీ లేక అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. వయగ్రా పిల్స్ వేసుకోవడం వల్ల క్రమ క్రమంగా అతని మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి సెరెబ్రోవాస్కులర్ హెమరేజ్ ఏర్పడటంతో.. అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మద్యంతో కలిపి వయగ్రా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు గురయ్యాడని, తద్వారా ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. వైద్యుల సలహా లేకుండా అంగస్తంభన కోసం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ అరుదైన కేసును ప్రచురించినట్లు జర్నల్లో పేర్కొన్నారు.
ప్రియురాలిని సుఖ పెట్టేందుకు వయాగ్రా వేసుకున్న వ్యక్తి మృతి
March 07, 2023
0
Tags