కర్నాటకలో బీజేపీ వివాదాస్పద నిర్ణయం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 March 2023

కర్నాటకలో బీజేపీ వివాదాస్పద నిర్ణయం


కర్నాటకలో ఓబీసీ కోటాలో 2బీ కింద ముస్లింలకు గతంలో కేటాయించిన 4% రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. వీటిని రెండు ఆధిపత్య వర్గాలైన వీరశైవ-లింగాయత్‌లు, వొక్కలిగలకు కేటాయించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థలలో ప్రవేశాలలో వీరిద్దరికీ రెండుశాతం రిజర్వేషన్లు పెంచింది. కర్నాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వెనుకబడిన తరగతుల్లో కొత్తగా రూపొందించిన 2సీ, 2డీ కేటగిరీల కింద వొక్కలిగల కోటా 4 శాతం నుంచి 6 శాతానికి, వీరశైవ-లింగాయత్‌ల కోటా 5శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా కింద అమలు చేస్తున్న 10% కోటాలో పోటీ పడాల్సి ఉంటుందని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1995లో ఓబీసీ కోటాలో కేటగిరీ 2బీ కింద ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. గత డిసెంబర్‌లో బెలగావిలో జరిగిన శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా వొక్కలిగలు, వీరశైవ-లింగాయత్‌ల కోసం 2సి, 2డీ కొత్త కేటగిరీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ఆధారంగా ఇప్పుడు కేబినెట్ ఈ రిజర్వేషన్ల మార్పుల నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. లింగాయత్, వొక్కలిగల్ని ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

No comments:

Post a Comment