తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లి నుంచి ఇబ్రహీంనగర్ వెళ్లే రహదారి మరమ్మత్తు నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలసి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం తుర్కకాశ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత రూ.1.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని చదువులు సిద్ధిపేటలోనే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే సిద్ధిపేటలో బీ ఫార్మసీ, లా కళాశాల తేనున్నట్లు చెప్పారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మొదటి స్థానంలో నిలవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. డీఈఓ, ఏంఈఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10వేలు నగదు పారితోషికం అందిస్తానని, మీరంతా బాసర ఐఐటీలో సీటు పొందాలని మంత్రి ఆకాంక్షించారు. వారం, పది రోజుల్లో ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహం ప్రారంభం కావాలని డీఈఓను మంత్రి ఆదేశించారు.
Post Top Ad
adg
Friday, 3 March 2023
Home
10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10వేలు నగదు పారితోషికం
telangana
అన్ని చదువులు సిద్ధిపేటలోనే అందుబాటులో ఉన్నాయి
మంత్రి హరీశ్ రావు
10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10వేలు నగదు పారితోషికం !
10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10వేలు నగదు పారితోషికం !
Tags
# 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10వేలు నగదు పారితోషికం
# telangana
# అన్ని చదువులు సిద్ధిపేటలోనే అందుబాటులో ఉన్నాయి
# మంత్రి హరీశ్ రావు
About Telugu Lo Computer
మంత్రి హరీశ్ రావు
Tags
10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10వేలు నగదు పారితోషికం,
telangana,
అన్ని చదువులు సిద్ధిపేటలోనే అందుబాటులో ఉన్నాయి,
మంత్రి హరీశ్ రావు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment