మణిపూర్లోని నోనీలో మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో స్వల్పంగా భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
మణిపూర్లో స్వల్ప భూకంపం !
February 28, 2023
0