వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి  ప్రకటించి, మాట్లాడుతూ సామాజిక న్యాయానికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామన్నారు. బీసీలంటూ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు, బ్యాక్‌బోన్‌ క్లాస్‌. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాము. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదు. వారిని అధికారంలో భాగస్వామ్యం చేశాం. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు.  టీడీపీ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలిలో 37 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం బీసీలకే 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. మండలిలో బీస్సీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామన్నారు. సామజిక సాధికారిత అంటే మాదే. చంద్రబాబు మాటలు చెబితే మేము చేతల్లో చూపించాము అని స్పష్టం చేశారు. చంద్రబాబు హయంలో 62.5 ఓసీలు, 32 శాతం బీసీలు ఉన్నారు. 87 మున్సిపాలిటీల్లో 84 చోట్ల గెలిచాము. 44 మంది మున్సిపల్‌ ఛైర్మన్లు బీసీలే ఉన్నారని తెలిపారు.

స్థానిక సంస్థలు : నర్తు రామారావు (బీసీ), కుడుపూడి సూర్యనారాయణ (బీసీ), వంకా రవీంద్రనాథ్‌ (పారిశ్రామికవేత్త), కవురు శ్రీనివాస్‌ (బీసీ), మేరుగ మురళి (ఎస్సీ), డాక్టర్  సిపాయి సుబ్రహ్మణ్యం, రామసుబ్బారెడ్డి (ఓసీ), డాక్టర్‌ మధుసూదన్‌ (బీసీ), ఎస్‌. మంగమ్మ (బీసీ),

ఎమ్మెల్యే కోటా : పెనుమత్స సూర్యనారాయణ (ఓసీ),  పోతుల సునీత (బీసీ), కోలా గురువులు, బొమ్మి ఇ‍జ్రాయిల్‌ ( ఎస్సీ), జయమంగళ వెంకటరమణ, ఏసు రత్నం (బీసీ), మర్రి రాజశేఖర్‌ (ఓసీ). 

గవర్నర్‌ కోటా : కుంభా రవి (ఎస్టీ), కర్రి పద్మశ్రీ (బీసీ)

Post a Comment

0Comments

Post a Comment (0)