శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ విసి వివాదాస్పద నిర్ణయం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో పలువురు  ఉద్యోగులు ఇటీవలి కాలంలో అకాల మరణం చెందుతుండడంతో కలత చెందిన పాలకులు దీన్ని నివారించేందుకు ప్రత్యేక పూజలు, హోమాలు జరపాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24న యూనివర్సిటీ క్యాంపస్‌లో శ్రీ ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం నిర్వహించనున్నారు. యూనవిర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం రామకృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 8.30 గంటలకు యూనివర్సిటీ క్రీడా వేదిక వద్ద హోమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌కెయు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవి లక్ష్మయ్య సర్కులర్ జారీచేశారు. ఉద్యోగులు, విద్యార్థులకు భగవంతుడి అనుగ్రహం లభించాలన్న ఉద్దేశంతోనే హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)