వివాదాస్పద వ్యాఖ్యలపై బాబా రాందేవ్ వివరణ !

Telugu Lo Computer
0


యోగా గురు రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రామ్ దేవ్ బాబా వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏదో ఒక వర్గానికి చెందిన వారిపై ఈ వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి మతంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తప్పా ఒప్పా అన్నది ఆలోచించుకోవాలని అన్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముస్లింలందరూ ఉగ్రవాదులు, రేపిస్టులు అని  రాందేవ్‌ బాబా నోరు జారారు. ఫిబ్రవరి 3న బర్మర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలు, క్రైస్తవులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ స్పందిస్తూ అవి తప్పా ఒప్పా అన్నది ఎవరికి వారే ఆలోచించాలని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)