ధాబా ఫ్రీజర్ లో యువతి మృతదేహం

Telugu Lo Computer
0


నైరుతి ఢిల్లీలోని నజఫ్గఢ్ లో ఉన్న ఓ ధాబాలోని ఫ్రీజర్ లో ఓ యువతి మృతదేహం కనపడింది. ఆ యువతికి 25 ఏళ్లు ఉంటాయని, ఆమెను రెండు-మూడు రోజుల ముందు హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు అన్నారు. ఆ ధాబా యజమాని సాహిల్ గహ్లోత్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆ యువతి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఉండేదని గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ధాబా యజమాని, బాధిత యువతి సన్నిహితంగా ఉండేవారని, ఆమె హత్య కేసులో గహ్లోత్ ను అనుమానితుడిగా అరెస్టు చేశామని అన్నారు. ఆ యువతితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తూనే మరో అమ్మాయితో గహ్లోత్ పెళ్లి కుదుర్చుకున్నాడని చెప్పారు. ఈ నేపథ్యంలో గహ్లోత్ తో బాధిత యువతి గొడవ పెట్టుకున్నట్లు  పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను గహ్లోత్ హత్య చేసి తన ధాబాలోని ఫ్రీజర్ లో ఆమె మృతదేహాన్ని దాచి పెట్టాడని అన్నారు. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)