రోడ్డు ప్రమాదంలో 14 మందికి గాయాలు

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్లగొండ జిల్లా నిడమనూరు దగ్గర సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆటో అతివేగంతో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడంతో ఆటో బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)