ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్య నారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మరణానికి కొన్ని నెలల ముందు నుంచే ఆయన బయటికి రావటం మానేశారు. ఇంటికే పరిమితం అయ్యారు. వీల్ ఛైర్లోనే ఉండిపోయారు. మనవరాలి పెళ్లి రిసెప్షన్కు సైతం ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మరణించారు. సూర్యనారాయణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, సూర్యనారాయణ పలు సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తన సత్య చిత్ర బ్యానర్పై అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. 1977లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన 'అడవి రాముడు' సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది.
నిర్మాత ఎ. సూర్య నారాయణ కన్నుమూత
January 20, 2023
0
Tags