పాదచారులను ఢీకొట్టిన లారీ : ఐదుగురు మృతి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌, లఖీంపూర్‌ ఖేరీలోని గోలా బెహ్రైచ్‌ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొీట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. దీంతో రెండు వాహనాలను వేరుచేయడానికి పాదచారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీకొీట్టింది. దీంతో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)