ఆంధ్రప్రదేశ్ లో భారాస ఫ్లెక్సీలు !

Telugu Lo Computer
0


ఖమ్మంలో ఈనెల 18వ తేదీన జరగనున్న భారాస ఆవిర్భావ సభకు పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు ఇతర నేతలు పాల్గొనాలని పార్టీ అధిష్ఠానం ఆహ్వానించింది. భారాస ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి రాష్ట్రశాఖ అధ్యక్ష నియామకం చంద్రశేఖర్‌దే. ఆయనతో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, చింతల పార్థసారథి తదితరులు భారాసలో చేరారు. అధిష్ఠానం ఆహ్వానం మేరకు ఏపీ నేతలు ఖమ్మం జిల్లా సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి జనసమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారత్‌ రాష్ట్రసమితి ఫ్లెక్సీలు, హోర్డింగులు శనివారం ఏర్పాటయ్యాయి. గుంటూరు, విజయవాడ, యానాం, కొత్తపేట, కడియం, కాకినాడ, ముమ్మిడివరం, తదితర నగరాలు, పట్టణాల్లోని రద్దీ ప్రాంతాల్లో సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. భారాస అధ్యక్షుడు కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావుల ఫొటోలు వీటిలో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)