బద్రుద్దీన్‌ అజ్మల్‌పై పోలీసు కేసు

Telugu Lo Computer
0


వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్‌ అజ్మల్‌పై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువులను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌పై కాంగ్రెస్ సభ్యుడు, అస్సాం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా శివసాగర్ జిల్లాలోని సిమలుగూరి పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన అజ్మల్‌పై ఇప్పటికే పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. సైకియా తన ఫిర్యాదులో అజ్మల్ వ్యాఖ్య హిందూ జనాభా పట్ల, ముఖ్యంగా భారతదేశంలోని హిందూ మహిళల పట్ల దురుద్ధేశం కలిగించిందని సైకియా ఫిర్యాదులో పేర్కొన్నారు. అస్సాం జాతీయ పరిషత్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బద్రుద్దీన్ అజ్మల్‌పై ఫిర్యాదులు చేసింది. తన వ్యాఖ్యలకు అజ్మల్ క్షమాపణలు చెప్పినా అతనిపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)