దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 4,41,42,989 మంది వైరస్ నుంచి కోలుకున్నారని పేర్కొంది. మరో 5,30, 693 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం 3424 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.01 శాతం యాక్టివ్ గా ఉండగా, 98.80 శాతం మంది కోలుకున్నారని తెలిపింది. కరోనా బారిన పడి 1.19 శాతం మంది మృతి చెందారని చెప్పింది. గత 24 గంటల్లో 1,11,304 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని పేర్కొంది. ఇప్పటివరకు 2,20,05,16,249 కరోనా టీకాలను పంపిణీ చేశామని వివరించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)