భారీగా హెరాయిన్ పట్టివేత

Telugu Lo Computer
0


ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. శుక్రవారం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డిఆర్ఐ) అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నైరోబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు అతని వద్ద 4.98 కిలోల హెరాయిన్‌ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.35కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)