కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు వేయాలని నిర్ణయించింది. దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మాట్లాడుతూ ''ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు ఎందుకు వేయకూడదు. కాషాయ రంగు అంటేనే ప్రతిపక్షాలకు భయం. కాషాయం అంటే మన జాతీయ పతాకంలోని రంగు. పాఠశాలలకు కాషాయ రంగు వేయాలనే నిర్ణయం వెనుక ఉన్నది స్వామి వివేకానంద. క్లాస్రూమ్స్కు స్వామి వివేకానంద పేరు పెట్టాం. ఆయన ఒక సన్యాసి. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఇలాంటి వాటిపై రాజకీయం చేయడం తగదు'' అని బవసరాజు బొమ్మై వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. పాఠశాలలకు జాతీయ జెండాలోని మూడు రంగులు వేయాలని, అలా కాకుండా కాషాయ రంగు మాత్రమే ఎందుకు అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
పాఠశాలలకు కాషాయ రంగు వేస్తే తప్పేంటి ?
November 14, 2022
0
Tags