డోర్‌లో తల ఇరుక్కుని చనిపోయిన దొంగ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో సార్‌నాథ్‌ ప్రాంతంలోని డానియాల్‌పూర్‌లో ఓ వక్తి మర మగ్గం సెంటర్‌లోకి చోరబడేందుకు యత్నించాడు. వాస్తవానికి ఆ సెంటర్‌ సరైన పని లేక గత రెండు రోజులుగా మూతబడి ఉంది. ఆ సెంటర్‌ను బద్దలుగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న తలుపుల్లో దొంగ తన తలను పెట్టడంతో అతడి తల ఇరుక్కుపోయింది. ఆ తలుపులు పైన తాళం వేసి ఉందని తెలియక చోరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని తల రెండు డోర్‌ల మధ్య ఇరుక్కుపోయింది, అతడి మిగతా శరీర భాగం బయటవైపు ఉండిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల జావేద్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)