తమిళనాడులోని సేలం జైలులో శిక్ష అనుభవిస్తున్న కార్తీక్ అనే యువకుడి కోసం తమ్ముడు గంజాయి బిస్కెట్లు తయారు చేశాడు.. అంటే.. సాధారణంగా క్రీమ్ బిస్కెట్లలో క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ను తొలగించి ఆ ప్లేస్లో గంజాయి నింపేశాడు. వాటిని అన్నకు చేరవేయాలని ప్లాన్ వేశాడు.. బిస్కెట్ ప్యాకెట్ను యథావిథిగా ప్యాక్ చేశాడు.. వాటిని తీసుకుని సేలం సెంట్రల్ జైలుకు వెళ్లాడు.. జైలులో ఉన్న కార్తీక్ను పరామర్శించాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గంజాయి బిస్కెట్లను జైలులోకి పంపించే ప్రయత్నం చేశాడు.. ఏదైనా చెక్ చేసిన తర్వాతే జైలులోకి పంపే అధికారులు, తనిఖీల్లో బిస్కెట్లలో గంజాయిని గుర్తించారు.. పోలీసులకు సమాచారం చేరవేశారు. ఇక, కార్తీక్ తమ్ముడిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.. అదే జైల్లో పెట్టారు.
సేలం జైలులో గంజాయి బిస్కెట్ల కలకలం !
November 10, 2022
0