గుజరాత్లో కచ్చితంగా ఆప్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఈసారి 92సీట్లు వస్తాయని ఓ కాగితంపై రాసి ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మీడియాకు చూపించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గాధ్వి, పాటిదార్ కోటా మాజీ లీడర్ అల్పేశ్ కతీరియాలు భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. ఆప్ అధికారంలోకి వస్తే భయపడుతూ బిజినెస్ చేసే రోజులు ఉండవని భరోసా ఇచ్చారు. మహిళలు, యువత ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పెంపు ఉండదన్నారు. నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల్లేని రాష్ట్రంగా గుజరాత్ను చూడాలనుకుంటే ఆప్కు ఓటేయాలని సూచించారు. గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసే వారికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా చూస్తామని, నిరుద్యోగులకు ప్రతీనెల రూ.3 వేల అలవెన్స్ ఇస్తామని చెప్పారు. బీజేపీకి తమకు మధ్య పోటీ లేదని, గుజరాత్లో తామే ముందంజలో ఉన్నామని కేజ్రీవాల్ మరోసారి స్పష్టం చేశారు.
92 స్థానాల్లో గెలుస్తాం !
November 29, 2022
0
Tags