10 కిలోల కిడ్నీ ట్యూమర్‌ను తొలగించిన వైద్యులు

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు 53 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఫుట్‌బాల్ సైజులో 10 కిలోల బరువున్న కిడ్నీ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించారు. విజయవంతమైన శస్త్ర చికిత్స తెలుగు రాష్ట్రాల్లో తొలిసారని, దేశంలోనే ఇది రెండోదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. డాక్టర్ తైఫ్ బెండిగేరి, రాజేష్ కె రెడ్డితో సహా డాక్టర్ మల్లికార్జున నేతృత్వంలోని యూరాలజిస్టుల బృందం ఈ సవాలును విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కడపకు చెందిన రోగికి కడుపులో వాపు రావడంతో ఏఐఎన్‌యూకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షలో, వైద్యులు పెద్ద ఉదర మాస్ గాయం ఉనికిని కనుగొన్నమని తెలిపారు. ఇమేజింగ్‌లో ఎడమ కిడ్నీ నుంచి కణితి ఉత్పన్నమైనట్లు తేలిందన్నారు. "కణితి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని, మేము రోబోటిక్ విధానాన్ని మినహాయించాము. బదులుగా ఓపెన్ సర్జరీని ఎంచుకున్నాము. గొప్ప ప్రయత్నాలతో కణితిని విజయవంతంగా తొలగించగలిగాము. శస్త్రచికిత్స తర్వాత, కణితి ఫుట్‌బాల్ పరిమాణంలో చాలా పెద్దదిగా ఉందని మేము కనుగొన్నాము. మైక్రోస్కోపిక్ పరీక్షలో కణితి క్యాన్సర్ పెరుగుదల (రీనల్ సెల్ కార్సినోమా) అని నిర్ధారించబడింది," అని డాక్టర్ మల్లికార్జున వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)