కేరళలోని కొల్లాం జిల్లా మినగపల్లికి చెందిన పూకుంజ్ (40) అనే వ్యక్తికి బుధవారం కలిసి వచ్చిన అదృష్టం ఇది. పూకుంజ్ ద్విచక్ర వాహనంపై చేపలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు కొద్ది రోజుల క్రితం కేరళ అక్షయ లాటరీ ఏకే570 కొద్ది రోజుల క్రితం కొన్నాడు. ఎప్పటిలాగే బుధవారం చేపలు అమ్ముకుని ఇంటికి తిరిగి వచ్చే సరికి 70 లక్షల రూపాయలు లాటరీ గెలుచుకున్నట్లు తెలిసింది. ఇక అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుంచి 9 లక్షల రూపాయల లోన్ పూకుంజ్ తీసుకున్నాడు. అయితే అవి తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడ్డాడు. బుధవారం సాయంత్రం చేపలు అమ్ముకుని ఇంటికి వచ్చి ముందుగా బ్యాంకు నోటీసు చూశాడు. గుండె పగిలి తీవ్ర నిరాశలో పడిపోయారు. ఇంతలో కొద్ది సమయానికి అతడి సోదరుడు ఫోన్ చేసి లాటరీ గెలుచుకున్నట్లు చెప్పాడు.
అదృష్టమంటే ఇదేనేమో !
October 13, 2022
0
Tags