ఒడిశాలోని జయపురంలోని జగత్ జనని ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సంగీత విభావరిలో మురళీ ప్రసాద్ మహాపాత్రా అనే గాయకుడు రెండు పాటలు పాడారు. ఆపై విశ్రాంతి తీసుకుంటూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి, మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, సబ్ కలెక్టర్ దేవధర ప్రధాన్ తదితరులు హాజరయ్యారు. కోరాపుఠ్ జిల్లాకు చెందిన మురళి 'ఖోకా భాయ్'గా అందరికీ సుపరిచితం. మురళీ ప్రసాద్ గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతోపాటు మధుమేహంతో బాధపడుతున్నట్టు ఆయన సోదరుడు బిభూతి ప్రసాద్ మహాపాత్రా తెలిపారు.
ఒడిశా దసరా ఉత్సవాల్లో విషాదం
October 04, 2022
0