లోన్‌ యాప్‌కు మరో ప్రాణం బలి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శ్రీనివాసరావు లోన్‌ యాప్‌లో లోన్‌ తీసుకున్నాడు. ఆ లోన్‌ డబ్బులు తిరిగి కట్టేశాడు కూడా. అయినప్పటికీ డబ్బులు కట్టాలని బెదిరించడంతో ఆఫీసులోనే శ్రీనివాసరావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకన్నాడు. ఆఫీసు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీనివాస్‌. దీంతో.. మృతుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు ఏఈ. మృతుడి తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)