ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత తడబాడుటుకు గురైనా ఆ తర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా నిలదొక్కుకుని ఆడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. 160 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా బ్యాటర్లు ఆదిలోనే వరుసగా వికెట్లు పోగొట్టుకున్నారు. ఆఫ్రిది బౌలింగ్లో కేఎల్ రాహుల్ (4), ఆ తర్వాత వరుసగా రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ (15), అక్షర్ పటేల్ (2) పెవిలియన్ చేరారు. వన్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని కదిలించాడు. హార్దిక్ పాండ్యా, కోహ్లీ సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూనే ఫోర్లు, సిక్సులు బాదారు. ఉత్కంఠభరిత మ్యాచ్లో చివరి ఓవర్లో హార్దిక్ అవుటయ్యాడు. దీంతో దినేశ్ కార్తీక్, కోహ్లీ టీ మిండియాకు విజయం సాధించిపెట్టారు.
ఉత్కంఠ మ్యాచ్లో పాకిస్తాన్ పై గెలుపు !
October 23, 2022
0