ఉత్కంఠ మ్యాచ్​లో పాకిస్తాన్​ పై గెలుపు​​ !

Telugu Lo Computer
0


ఐసీసీ టీ20 వరల్డ్ కప్​ 2022లో పాకిస్తాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత తడబాడుటుకు గురైనా ఆ తర్వాత విరాట్​ కోహ్లీ, హార్దిక్​ పాండ్యా నిలదొక్కుకుని ఆడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. 160 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన ఇండియా బ్యాటర్లు ఆదిలోనే వరుసగా వికెట్లు పోగొట్టుకున్నారు. ​ఆఫ్రిది బౌలింగ్​లో కేఎల్​ రాహుల్ (4)​, ఆ తర్వాత వరుసగా రోహిత్​ శర్మ (4), సూర్యకుమార్​ (15), అక్షర్​ పటేల్​ (2) పెవిలియన్  చేరారు. వన్​ డౌన్​లో వచ్చిన విరాట్​ కోహ్లీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని కదిలించాడు. హార్దిక్​ పాండ్యా, కోహ్లీ సింగిల్స్​, డబుల్స్​ తీసుకుంటూనే ఫోర్లు, సిక్సులు బాదారు. ఉత్కంఠభరిత మ్యాచ్​లో చివరి ఓవర్​లో హార్దిక్​ అవుటయ్యాడు. దీంతో దినేశ్​ కార్తీక్​, కోహ్లీ టీ ​మిండియాకు విజయం సాధించిపెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)