టపాసులు కాల్చొద్దన్నందుకు కత్తితో పొడిచి హత్య !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ముంబై నగరంలో శివాజీ నగర్ ప్రాంతంలో ముగ్గురు మైనర్లు బహిరంగంగా టపాసులు కాలుస్తున్నారు. కొద్ది సేపటికి మరికొన్ని టపాసులను సీసాల్లో పెట్టి కాలుస్తున్నారు. ఈ ముగ్గురు బాలుర ప్రవర్తనకు చుట్టుపక్కల వారు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న 21 ఏళ్ల యువకుడు అలా టపాసులు కాల్చొద్దని వారితో వారించాడు. ఈక్రమంలో ఇరువురి మధ్య మాట మాట పెరిగి పెద్ద వాగ్వాదం తలెత్తింది. ముగ్గురు మైనర్లలోని ఒకరు కోపంతో సదరు వ్యక్తిని దారుణంగా కొట్టాడు. అనంతరం చాకుతో మెడపై పొడిచి పరారయ్యాడు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులైన మైనర్లులో ఇద్దరు 14, 15 ఏళ్లు ఉండగా మరొకరికి 12 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శివాజీ నగర్ లోని గోవండి ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)