పడవ మునిగి 76 మంది మృతి

Telugu Lo Computer
0


నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో  85 మందితో వెళ్తున్న పడవ ఒగ్​బారూ ప్రాంతంలో వరదల కారణంగా ఒక్కసారిగా మునిగిపోవడంతో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.  ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇతర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు 76 మృతదేహాలు వెలికితీశారు. ఈ దుర్ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు. పడవలోని ప్రతి ఒక్కరి ఆచూకీ తెలిసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని బాధితులకు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)