రష్యా మిస్సైల్ దాడిలో 17 మంది మృతి

Telugu Lo Computer
0


దక్షిణ ఉక్రెయిన్ పారిశ్రామిక నగరం జపొరిజ్జియా ప్రాంతంపై రష్యా మరోసారి దాడి చేసింది. ఏడు మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు 17 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారులు  తెలిపారు. మిస్సైల్ దాడి వల్ల నగరంలోని 5 అంతస్తుల భవనం నేలమట్టం అయింది. జపొరిజ్జియా ప్రతీ రోజూ రాకెట్ దాడికి గురవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం కోసం రష్యా- ఉక్రెయిన్ సేనల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతోంది. ఈ ప్రాంతంలోనే యూరప్ లో పెద్దదైన జపొరోజ్జియా అణువిద్యుత్ కర్మాగారం ఉంది. ఈ ప్రాంతంపై రష్యా పదేపదే క్షిపణి దాడులు చేస్తోంది. గత వారం జొపొరిజ్జియాలో పౌరుల వాహనాలపై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 30 మంది మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)