ప్రముఖ నటి వాణిశ్రీ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.20 కోట్లకు పై మాటేనట ! అయితే, నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్ను రద్దు చేసి, ఆ భూమిని తిరిగి వాణిశ్రీకి అందించింది తమిళనాడు ప్రభుత్వం. సీఎం స్టాలిన్ స్వయంగా.. ఆ భూమి పత్రాలను వాణిశ్రీకి అందించారు.. మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి ఆ భూమిని కాపాడి, తిరిగి యజమానులకు అందించారు. వారిలో వాణిశ్రీ ఒకరు. సీఎం స్టాలిన్ చేతుల మీదుగా సంబంధిత భూమి పత్రాలు అందుకున్న వాణిశ్రీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రూ. 20 కోట్ల విలువైన తన భూమిని ఫేక్ సర్టిఫికెట్లతో కబ్జా చేశారు. దీనిపై ఎంతో మందికి మొరపెట్టుకున్నాను. ఎందరినో కలిశాను. తాను 11 ఏళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయానని, ఇకపై ఆ భూమిపై పైసా కూడా ఖర్చు పెట్టకూడదనే నిర్ణానికి వచ్చాను.. కానీ, ముఖ్యమంత్రి స్టాలిన్ కల్పించుకుని.. తన భూమిని తిరిగి ఇప్పించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.. ఆయన చల్లగా ఉండాలని, మంచి పాలన అందిస్తూనే ఉండాలని వాణిశ్రీ ఆకాంక్షించారు.
కబ్జా గురైన వాణిశ్రీ భూమిని అప్పగించిన స్టాలిన్
September 29, 2022
0