ముంబైలో నిన్న అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. కండివాలీ ప్రాంతంలో రాత్రి 12.15 గంటల సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు వ్యక్తిగత గొడవలే కారణమని డీసీపీ విషాల్ తెలిపారు. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెప్పారు. మృతుడిని అంకిత్ యాదవ్గా గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Post a Comment
0Comments
3/related/default