ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మోడల్

Telugu Lo Computer
0


ముంబైలోని అంథేరికి చెందిన ఓ హోటల్ రూమ్‌లో 30 ఏళ్ల మోడల్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం రాత్రి 8 గంటలకు ఆ హోటల్‌కు ఆమె చెకిన్ అయ్యింది. డిన్నర్ కూడా ఆమె ఆర్డర్ చేసింది. కానీ గురువారం ఉదయం ఆమె డోర్ తీయలేదు. హౌజ్‌కీపింగ్ స్టాఫ్ ఎంత పిలిచినా ఆమె డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో హోటల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాస్టర్ కీ ద్వారా పోలీసులు ఆ రూమ్ తలుపు ఓపెన్ చేశారు. ఫ్యాన్‌కు మోడల్ ఉరివేసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ రూమ్ నుంచి ఓ సూసైడ్ నోట్‌ను రికవరీ చేశారు. ఐయామ్ సారీ, నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, నేను సంతోషంగా లేనని, నాకు ప్రశాంతత కావాలని సూసైడ్ నోట్‌లో ఆమె రాసింది. వెర్సోవా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌కు పంపారు. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)