నాకొద్దీ పెళ్లి ... పీటల మీద నుంచి లేచి పోయిన పెళ్లికూతురు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలోని భర్తనా పట్టణానికి చెందిన యువతి ఫోటోలో చూసిన వ్యక్తి ఇతడు కాదు. అతను చాలా అందంగా ఉన్నాడు.  వీళ్లు నన్ను మోసం చేశారు. ఇతను నల్లగా ఉన్నాడు.. నచ్చలేదు.. నాకొద్దీ పెళ్లి అని పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లి పోయింది పెళ్లి కూతురు. అయితే వధువును ఒప్పించేందుకు ఇరు కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా యువతి అతడిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. ఈ పంచాయితీ కాస్తా చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి దాదాపు ఆరుగంటల పాటు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి పెళ్లి రద్దు చేశారు. పెళ్లి ఆగిపోవడంతో ఆగ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)