ప్రధాన ఆర్థిక జ్యోతిష్కుడిని నియమించుకోండి !

Telugu Lo Computer
0


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తన స్వంత నైపుణ్యాలపై ఆశలు వదులుకున్నారని, అందుకే గ్రహాలను ఆశ్రయిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం  పి చిదంబరం ఎద్దేవా చేశారు  ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి గ్రహాలను పిలుస్తున్నారని చురకలంటించారు. అమెరికా రోదసీ పరిశోధక సంస్థ నాసా ట్వీట్ చేసిన యురేనస్, ప్లూటో, జూపిటర్ చిత్రాలను నిర్మల సీతారామన్  రీట్వీట్ చేశారు. ఈ చిత్రాలను నాసా నూతన శక్తిమంతమైన స్పేస్ టెలిస్కోప్‌తో తీశారు. ఈ నేపథ్యంలో చిదంబరం  గురువారం ఇచ్చిన ట్వీట్‌లో ద్రవ్యోల్బణం 7.01 శాతం, నిరుద్యోగం పెరుగుదల 7.8 శాతం నమోదైన రోజున ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జూపిటర్, ప్లూటో, యురేనస్ చిత్రాలను ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఆమెకు తన సొంత నైపుణ్యాలపైనా, తన ఆర్థిక సలహాదారుల నైపుణ్యాలపైనా ఆశలు అడుగంటాయని, అందుకే ఆర్థిక వ్యవస్థను కాపాడాలని గ్రహాలను పిలుస్తున్నారని అన్నారు. ప్రధాన ఆర్థిక జ్యోతిష్కుడును నియమించుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. నిర్మల సీతారామన్ ఈ గ్రహాల చిత్రాలను రీట్వీట్ చేయడంపై కాంగ్రెస్ బుధవారం ఘాటుగా స్పందించింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కన్నా యురేనస్, ప్లూటోలపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని మండిపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)