రమ్యకృష్ణతో విడాకులు అబద్దం !

Telugu Lo Computer
0


కృష్ణవంశీ తీసిన సినిమాలకి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. గత కొంతకాలంగా మంచి హిట్ కోసం చూస్తున్న కృష్ణవంశీ ప్రస్తుతం మరాఠీలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ సినిమాని రంగమార్తాండగా తెరకెక్కిస్తున్నారు. కృష్ణవంశీ హీరోయిన్ రమ్య కృష్ణని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. గతంలో రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోతారని వార్తలు వచ్చాయి. కానీ వాటిపై వీరిద్దరూ స్పందించలేదు. తాజాగా రంగమార్తాండ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కృష్ణవంశీ తన పెళ్లి, విడాకుల రూమర్స్ గురించి నోరు విప్పారు. కృష్ణవంశీ మాట్లాడుతూ  ”భాద్యతలు వస్తాయని ఆ భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నాను. కానీ రమ్యకృష్ణతో ప్రేమలో పడి పెళ్లి జరిగిపోయింది. ఇదంతా లైఫ్‌ డిజైన్‌ అని అనుకుంటాను. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు ఏం రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులాగానే ఉండనిచ్చింది. రమ్యకృష్ణతో విడాకులు అనేది అబద్దం. అందులో అసలు నిజం లేదు. పబ్లిక్‌ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. కానీ మేం పెద్దగా పట్టించుకోం. అందుకే అవి విన్నప్పుడు ఖండించాలని కూడా అనుకోము. జస్ట్‌ నవ్వి ఊరుకుంటాం అంతే” అని తెలిపారు.  కృష్ణవంశీ గులాబీ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)