లడఖ్ సరిహద్దులో చైనా యుద్ధ విమానం

Telugu Lo Computer
0


భారత సరిహద్దులోని తూర్పు లడాఖ్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్దకు గత నెల చివరి వారంలో చైనా యుద్ధ విమానం  దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏ పరిస్థితి ఎదరైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది. చైనా విమానం దూసుకొచ్చిన విషయాన్ని భారత ఆర్మీ, చైనా దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన చైనా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. 2020లో చైనాతో సరిహద్దులో నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో అక్కడ భద్రతను భారత ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. చైనా నుంచి ఎలాంటి సవాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సైన్యాన్ని అన్నిరకాలుగా సిద్ధం చేసింది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగేవి. చాలా కాలం తర్వాత చైనా ఇలాంటి చర్యకు దిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)