నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న తిరుమాడ వీధుల్లో చెప్పులతో తిరగడం ఇప్పుడు వివాదాస్పంగా మారింది. ఈ సందర్భంగా విఘ్నేశ్ చెప్పులు విడిచి నడిచినా, నయనతార మాత్రం చెప్పులతోనే మాడ వీధుల్లో తిరిగారు. అంతేకాకుండా శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి అత్యంత సమీపంలోనే వారు ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఇలా తిరుమల పవిత్రతకు నయనతార దంపతులు భంగం కలిగించేలా వ్యవహరించిన తీరుపై శ్రీవారి భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) స్పందించింది. శ్రీవారి ఆలయం సమీపంలోనే నయనతార దంపతుల ఫొటోషూట్పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార కాళ్లకు చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించడం దురదృష్టకరనమని టీటీడీ అధికారులు అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని టీటీడీ ప్రకటించింది. వారిపై ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చన్న విషయంపై చర్చిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
నయనతార, విఘ్నేష్ శివన్ పై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు !
June 11, 2022
0
Tags