అన్నం వడ్డించలేదని భార్యను చంపి భర్త

Telugu Lo Computer
0


ఢిల్లీ పోలీసులకు శుక్రవారం ఉదయం 9గంటల 20నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో భార్యను దిండుతో నొక్కి చంపేశాడంటూ చెప్పాడు. విచారణ జరిపిన పోలీసులు ప్రాంతంలో ఎంక్వైరీ చేసి అతని వద్ద నుంచి రూ.43వేల 280 డబ్బును, రెండు మందు బాటిల్స్, రక్తపు మరకలు అంటిన దిండు స్వాధీనం చేసుకున్నారు. 2008లో వివాహం చేసుకున్న వినోద్ కుమార్ దూబె అతని భార్య సోనాలి కలిసి ఆల్కహాల్ తీసుకున్నారు. గురువారం రాత్రి బాగా తాగిన తర్వాత ఆహారం తీసుకురావాల్సిందిగా భార్యను ఆదేశించాడు. ఆ విషయంలో ఇద్దరికీ గొడవ జరగడంతో భార్య అతణ్ని చెంపదెబ్బ కొట్టింది. ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమెను హతమార్చాడు. పోలీసులకు భయపడి డబ్బు తీసుకుని పరారీ అవుతుండగా అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)