నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు...! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 26 June 2022

నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు...!


ఉత్తరప్రదేశ్ ఆగ్రా పోలీసులు తెలిపిన వివరాల మేరకు  నాగ్లా మేవతిలోని అపార్ట్‌మెంట్‌లో రితికా సింగ్‌ ఆనే వివాహిత హత్యకు గురైంది. ఆమె ఘజియాబాద్‌ నివాసి. ఫిరోజాబాద్‌ కు చెందిన  ఆకాశ్‌ గౌతమ్‌ని 2014లో వివాహం చేసుకుంది.  ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేరు వేరుగా ఉంటున్నారు. ఈ మేరకు రితికా సింగ్‌ తన ఫేస్‌బుక్‌ స్నేహితుడు విపుల్‌ అగర్వాల్‌తో నాగ్లామేవతి అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటుంది. ఇందిలా ఉండగా ఆమె మాజీ భర్త, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేసేందుకు యత్నించారు. ఈ హఠాత్పరిణామానికి రితికా ఒక్కసారిగా షాక్‌ అయ్యింది. వారంతా రితికా ప్రియుడి పై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వారు రితికా చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు. ఈ మేరకు రితికా స్నేహితుడు విపుల్‌ అగర్వాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ కేసుకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

No comments:

Post a Comment