నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు...!

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ ఆగ్రా పోలీసులు తెలిపిన వివరాల మేరకు  నాగ్లా మేవతిలోని అపార్ట్‌మెంట్‌లో రితికా సింగ్‌ ఆనే వివాహిత హత్యకు గురైంది. ఆమె ఘజియాబాద్‌ నివాసి. ఫిరోజాబాద్‌ కు చెందిన  ఆకాశ్‌ గౌతమ్‌ని 2014లో వివాహం చేసుకుంది.  ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేరు వేరుగా ఉంటున్నారు. ఈ మేరకు రితికా సింగ్‌ తన ఫేస్‌బుక్‌ స్నేహితుడు విపుల్‌ అగర్వాల్‌తో నాగ్లామేవతి అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటుంది. ఇందిలా ఉండగా ఆమె మాజీ భర్త, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేసేందుకు యత్నించారు. ఈ హఠాత్పరిణామానికి రితికా ఒక్కసారిగా షాక్‌ అయ్యింది. వారంతా రితికా ప్రియుడి పై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వారు రితికా చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు. ఈ మేరకు రితికా స్నేహితుడు విపుల్‌ అగర్వాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ కేసుకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)