కర్ణాటకలోని దొడ్డ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని త్యాగరాజనగర్ కోర్టు రోడ్డులో నివసిస్తున్న గౌతమ్ (28), వందన (24)ను ఒకటిన్నర ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వందనా అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, గౌతమ్ సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరిది కులాంతర వివాహం కావడంతో అత్తగారింట్లో వేధింపులు మొదలయ్యాయి. భర్త మత్తు పదార్థాలకు బానిసై వేధించేవాడు. దీంతో విసిగిపోయిన వందనా రెండు నెలల క్రితం భర్తను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. కానీ భర్తలో మార్పు రాలేదు. మంగళవారంనాడు ఇంట్లో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దొడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
భర్త వేధింపులు తాళలేక ఉరేసుకున్న భార్య
May 04, 2022
0
Tags