నేడు బెంగళూరుకు కేసీఆర్

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు బెంగళూరుకు వస్తున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పద్మనాభనగర్‌లోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళతారు. దేవెగౌడతో ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చిస్తారు. మాజీ సీఎం కుమారస్వామి కూడా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కేసీఆర్‌ పద్మనాభనగర్‌లోనే గడుపుతారు. తర్వాత బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెనుతిరుగుతారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే పంజాబ్‌కు వెళ్లి వచ్చారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ జేడీఎస్ తో కలిసి పనిచేసేందుకు కేసీఆర్‌ ఉత్సాహంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్‌ రెండుసార్లు మాజీ ప్రధాని దేవెగౌడను భేటీ అయ్యారు.


Post a Comment

0Comments

Post a Comment (0)