మంకీపాక్స్ వైరస్ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కలవరపెడుతోంది. ఇప్పటికే 20 దేశాలకు ఈ వైరస్ పాకగా.. 200లకు పైగా కేసులు వెలుగుచూశాయి. మరో 100 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ గురించి ముమ్మర పరిశోధనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దేశానికి చెందిన మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్కేర్ మంకీపాక్స్ను గుర్తించేందుకు ఓ రియల్టైమ్ పీసీఆర్ కిట్ను రూపొందించింది. 'ట్రివిట్రాన్ హెల్త్కేర్కు చెందిన రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందం.. మంకీపాక్స్ వైరస్ను గుర్తించేందుకు ఓ ఆర్టీ-పీసీఆర్ కిట్ను తయారుచేసింది. ఇది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్. ఇది వన్ ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్లో స్మాల్పాక్స్, మంకీపాక్స్ తేడాను గుర్తిస్తుంది. ఈ కిట్ ద్వారా గంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు'' అని ట్రివిట్రాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కిట్తో టెస్టు చేసుకునేందుకు పొడి స్వాబ్లతో పాటు వీటీఎం(వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా) స్వాబ్లను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ చంద్ర గంజూ మాట్లాడుతూ.. ''ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి సాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడూ ముందుంటుంది'' అని తెలిపారు.
మంకీపాక్స్ను గుర్తించే ఆర్టీ-పీసీఆర్ కిట్ !
May 28, 2022
0
Tags