మహేందర్ రెడ్డి వ్యవహారంపై కేటీఆర్ గరంగరం

Telugu Lo Computer
0


తెలంగాణలోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. మహేందర్ రెడ్డి వ్యవహారాన్ని ఆయన కేటీఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఘటనపై కేటీఆర్ సీరియస్ అయినట్టు సమాచారం. అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డినీ అధిష్ఠానం పిలిచినట్టు సమాచారం. ఆయన కూడా కేటీఆర్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఓ గుడిలో కార్యక్రమానికి సంబంధించి రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు హాజరుకాగా తనను కాదని ఎమ్మెల్యే అనుచరులకు కార్పెట్ వేశారంటూ తాండూరు సీఐపై మహేందర్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారంటూ ఓ ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మహేందర్ రెడ్డి స్పందిస్తూ, ఆ ఆడియో తనది కాదని అన్నారు. ఇసుక దందాలో రోహిత్ రెడ్డి, సీఐకి ప్రమేయం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)