బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల మేలిమి బంగారం రూ.100 పెరిగి రూ.51,812 వద్ద స్థిర పడింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1931 డాలర్ల వద్ద ట్రేడయింది. కానీ, బంగారానికి భిన్నంగా వెండి కిలో ధర రూ.252 తగ్గి రూ.67,299 నుంచి రూ.67,047కు చేరుకున్నది. ముంబై బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.67,173 పలికింది. తులం మేలిమి బంగారం ధర రూ,51,822 పలికింది. గోల్డ్ బంగారం తులం ధర రూ. 51,615గా ఉంది. కోల్కతాలో కిలో వెండి ధర రూ.67,200 పలికింది. 24 క్యారట్ల బంగారం తులం రూ.52,350 పలికితే, 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.49,650గా ఉంది. 22 క్యారట్ల తులం బంగారం ధర రూ.50,400 వద్ద స్థిర పడింది.
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
April 02, 2022
0