ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో మోతీ నగర్ టౌన్ లో ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి బుధవారం ఉదయం సమయంలో స్కూల్ బస్సులో బయలుదేరాడు. ఈ క్రమంలోనే చల్లటి గాలిని ఆస్వాదించేందుకు బస్సు కిటికీ తెరిచి తలను బయటపెట్టాడు. సడన్ గా కరెంట్ పోల్ తగిలింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటన తర్వాత విద్యార్తి తల్లిదండ్రులను పిలిచిన పాఠశాల యాజమాన్యం బాలుడి ఆరోగ్యం బాగాలేదని వాంతులు చేరుకునేందుకు బస్సు బయటకి తలపెట్టాడని కరెంట్ పోల్ తగిలింది అని చెప్పారు. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు చనిపోయాడని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. యాజమాన్యం తమ కుమారుడి ఆరోగ్యం బాలేదు అని చెబుతుంది అంత అవాస్తవం అంటూ ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం..
కరెంట్ పోల్ తగిలి విద్యార్థి మృతి
April 21, 2022
0
Tags